Header Ads

క్షీరసాగరమధనం




దేవదానవులు క్షిర సాగరం మదిస్తుంటే అమృతం పుట్టింది. అమృతాన్ని ఎలా పంచుకోవాల అన్న విషయం మీద దేవా దానవులు ఘర్షణకు దిగారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు జగన్మోహిని రూపం దాల్చి వారి ఇరువురి మధ్యకు వయ్యారంగా వచ్చి నిలబడ్డాడు . మనసులు మెలిపెట్టి మరులను రగిలించే మన్మధ శరణు లాంటి సుందరాంగి వంపుసొంపులకు తళతళకు దానవులు తబ్బిబ్బే కనురెప్పలు వెయ్యటం కూడా మాని గుటకలు వేస్తూ నిలబడిపోయారు. జగన్మోహిని తన సౌందర్యంతో దానవులు కళ్ళకు కనువిందు చేస్తూ అమృతాన్ని దేవతలకు పంచిపెట్టి మాయమైపోయింది. విషయాన్నీ కలహభోజనుడైన నారదుడు పరమశివుని చెవిలో ఊదాడు . అప్పుడు పరమశివుడు మనోనిగ్రహం లేని నీవంటి  వారు విష్ణు మాయ విలాసానికి లోనవుతారే కానీ నావంటి విరగని ఎలాంటి సౌందర్యం వంచించదు లేదు అన్నాడు. అంతటితో ఆగక పరమశివుడు విష్ణువుని కలిసి జగన్మోహిని రూపాన్ని చూపించు అని అడిగాడు . పరమేశ్వరుడు అడిగితే పరంధాముడు కాదనగలడా .మరల జగన్మోహిని రూపం దాల్చాడు. విశ్వాన్ని సైతం వివశతకు గురిచేస్తూ అసాధారణ సౌందర్య భావన చూసి విరాగి స్మశాన సంచరియుడైన పరమశివుడు శృంగార రసావేశానికి లోనై తనను తానే మరిచి జగన్మోహిని వెంటపడ్డాడు . జగన్మోహిని చిక్కక చిరునవ్వులు చిందిస్తూ పరుగులు తీస్తుంది. భూలోకంలోకి వచ్చి నర్తకి శిలా  రూపం దాల్చింది . అదే మన తూర్పు గోదావరి జిల్లాలోని ర్యాలీ అనే గ్రామం .

No comments

Powered by Blogger.